దైవసన్నిధి
దైవసన్నిధి (7 మెట్ల ధ్యానము) అతి పరిశుద్ధ స్థలమందు ఆసీనుడైయున్న ప్రభువును చూచుటకై ఆయతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గమును నేటి కాలమందు దేవదాసు అయ్యగారిద్వారా బోధింపబడి నేర్పించబడినది. ఈ సాధనము అభ్యసించుట ద్వారానే నేటి కాలమందు అనేకులు దైవ ప్రత్యక్షత పొందగలుగుచున్నారు. దీనికే మెట్ల ప్రార్థనయని పేరిడిరి. ఇందులో 7 మెట్లు గలవు. ఈ 7 మెట్ల ప్రకారం ధ్యానము చేయుటనే దైవసన్నిధి కూట మన్నారు. 1. మనో నిదానము : (Concentration of Mind) ప్రార్థన స్థలములో మోకరించి, లౌకిక విషయములపైనున్న మనస్సును దేవునిపైకి మరలించుట. సమస్త విషయాలను మరచిపోవుట. ఫోటో తీయునపుడు శరీరము కదలకుండా కెమేరావైపు ఎలాగు తీక్షణంగా చూస్తామో అలాగే ప్రభువుపై దృష్టి నిలపవలెను. దీనినే మలుపు మరపు మెట్టు అని యన్నారు. దా. కీ. 27:14 నందు దేవునిచూడ నపేక్షకలిగిన దావీదుకు దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము... ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పగా, దా.కీ. 51:7నందు దేవా నా హృదయము నిబ్బరముగా నున్నదిఅని దావీదు ప్రత్యుత్తరమిచ్చుచున్నాడు. గనుకనే బ్రతికి యుండగనే పరలోక, పాతాళలోకమందును దేవుని స్తుతించినాడు. 2. పా...



